లతా మంగేష్కర్‌కు పాక్ కెప్టెన్ బాబర్ ఆజం నివాళులు

ABN , First Publish Date - 2022-02-07T01:05:55+05:30 IST

ఈ ఉదయం తుది శ్వాస విడిచిన గాన కోకిల లతా మంగేష్కర్‌కు పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం నివాళులర్పించాడు

లతా మంగేష్కర్‌కు పాక్ కెప్టెన్ బాబర్ ఆజం నివాళులు

ముంబై: ఈ ఉదయం తుది శ్వాస విడిచిన గాన కోకిల లతా మంగేష్కర్‌కు పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం నివాళులర్పించాడు. ఓ స్వర్ణ యుగం ముగిసిపోయిందని ఓ ట్వీట్‌లో ఆవేదన వ్యక్తం చేశాడు. అయినప్పటికీ ఆమె స్వరం ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందిలో జీవించే ఉంటుందని అన్నాడు. 


అలాగే,  పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ రమీజ్ రాజా, శ్రీలంక బ్యాటర్ దిముత్ కరుణ రత్నే.. లతకు నివాళులు అర్పించారు. కరీబియన్‌లో తాను లత పాటలు పాటు వింటూ పెరిగానని వెస్టిండీస్ బ్యాటర్ డారెన్ గంగా గుర్తు చేసుకున్నాడు. ఆమెకు తన నివాళులు అర్పిస్తున్నట్టు పేర్కొన్నాడు. వెస్టిండీస్‌తో అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరుగుతున్న తొలి వన్డేలో భారత క్రికెటర్లు లత మృతికి నివాళిగా చేతికి నల్ల బ్యాండ్లు ధరించారు. 


మ్యాచ్‌లు చూసేందుకు వచ్చే ఏ అవకాశాన్ని లతా మంగేష్కర్ ఎప్పుడూ వదులుకోలేదు. భారత దిగ్గజ క్రికెటర్లు అయిన సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్‌లతో ఆమెకు మంచి సంబంధాలు ఉన్నాయి. అంతేకాదు, 1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు నగదు బహుమతులు అందించేందుకు నిధుల సేకరణ కోసం లత సంగీత కచేరీ కూడా నిర్వహించారు.

Updated Date - 2022-02-07T01:05:55+05:30 IST