Pakistan:లష్కరే తోయిబా స్థావరం మార్చింది...

ABN , First Publish Date - 2021-07-27T13:08:02+05:30 IST

పాకిస్థాన్ దేశం కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న లష్కరే తోయిబా తన రహస్య స్థావరాన్ని మార్చినట్లు...

Pakistan:లష్కరే తోయిబా స్థావరం మార్చింది...

భారతదేశానికి ఆఫ్ఘాన్ సర్కారు సమాచారం...

న్యూఢిల్లీ : పాకిస్థాన్ దేశం కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న లష్కరే తోయిబా తన రహస్య స్థావరాన్ని మార్చినట్లు ఆప్ఘనిస్థాన్ ప్రభుత్వం భారతదేశానికి తెలిపింది. ఉత్తర పాకిస్థాన్, దక్షిణ వజీరిస్థాన్ ల నుంచి పలు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు తమ రహస్య స్థావరాలను ఆప్ఘనిస్థాన్ దేశంలోకి మార్చడానికి ప్రయత్నిస్తున్నాయని ఆఫ్ఘాన్ సర్కారు భారతదేశానికి సమాచారం అందించింది.ఈ నెల ప్రారంభంలో పాకిస్థాన్ దేశాన్ని ఆఫ్ఘాన్ అధ్యక్షుడు ఘనీ బహిరంగంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో పదివేలమందికి పైగా జిహాది యోధులు పాకిస్థాన్ దేశం నుంచి ఆఫ్ఘనిస్థాన్ దేశంలోకి ప్రవేశించారని సమాచారం.గత కొన్ని వారాల్లో ఆఫ్ఘనిస్థాన్ దేశంలో మరణించిన, గాయపడిన ఉగ్రవాదులు పాకిస్థాన్ దేశానికి చెందిన వారని వారి గుర్తింపు కార్డులను బట్టి వెల్లడైంది. ఖైబర్ ఫఖ్తూన్ఖ్వా, బలూచిస్థాన్ మదర్సాల నుంచి ఆఫ్ఘాన్ జిహాద్ లో చేరారని తేలింది.


Updated Date - 2021-07-27T13:08:02+05:30 IST