వరల్డ్‌కప్‌లో భారత్‌ కావాలనే ఓడింది

ABN , First Publish Date - 2020-06-01T09:39:52+05:30 IST

వన్డే వరల్డ్‌క్‌ప (2019)లో భారత జట్టు ఇంగ్లండ్‌ మీద కావాలనే ఓడిందని పాకిస్థాన్‌ మాజీ స్పిన్నర్‌ ముస్తాక్‌ అహ్మద్‌ ఆరోపించాడు. ఇదే విషయాన్ని తనకు జేసన్‌ హోల్డర్‌, క్రిస్‌ గేల్‌, రస్సెల్‌ కూడా చెప్పారన్నాడు. ‘వరల్డ్‌కప్‌ సమయంలో నేను విండీస్‌

వరల్డ్‌కప్‌లో భారత్‌ కావాలనే ఓడింది

న్యూఢిల్లీ: వన్డే వరల్డ్‌క్‌ప (2019)లో భారత జట్టు ఇంగ్లండ్‌ మీద కావాలనే ఓడిందని పాకిస్థాన్‌ మాజీ స్పిన్నర్‌ ముస్తాక్‌ అహ్మద్‌ ఆరోపించాడు. ఇదే విషయాన్ని తనకు జేసన్‌ హోల్డర్‌, క్రిస్‌ గేల్‌, రస్సెల్‌ కూడా చెప్పారన్నాడు. ‘వరల్డ్‌కప్‌ సమయంలో నేను విండీస్‌ జట్టుతో పాటే పనిచేశా. ఇంగ్లండ్‌తో గ్రూప్‌ మ్యాచ్‌లో భారత్‌ ఓడాక నా దగ్గరికి వచ్చిన హోల్డర్‌, గేల్‌, రస్సెల్‌.. పాకిస్థాన్‌ సెమీ్‌సకు చేరడం భారత్‌కు ఇష్టం లేదన్నారు’ అని ముస్తాక్‌ వివరించాడు. అటు బెన్‌ స్టోక్స్‌ తన పుస్తకంలోనూ భారత బ్యాట్స్‌మెన్‌ ఆడిన తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. రోహిత్‌-కోహ్లీ జోడీ ఆటలో వేగం కనిపించలేదని, ధోనీ కూడా తన స్థాయికి తగ్గట్టుగా ఆడలేదని రాసుకొచ్చాడు.

Updated Date - 2020-06-01T09:39:52+05:30 IST