తెలంగాణ ఉద్యమంలో పైలం సేవలు మరువలేనివి
ABN , First Publish Date - 2020-12-06T05:35:21+05:30 IST
ప్రజా గాయకుడు ఫైలం సంతోష్ సాహిత్య రంగానికి, తెలంగాణ ఉద్యమానికి చేసిన సేవలు మరవలేనివని జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు.
నల్లగొండ కల్చరల్, డిసెంబరు 5 : ప్రజా గాయకుడు ఫైలం సంతోష్ సాహిత్య రంగానికి, తెలంగాణ ఉద్యమానికి చేసిన సేవలు మరవలేనివని జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని అంబేద్కర్ భవన్ శనివారం రాత్రి నిర్వహించిన ఫైలం సంతోష్ సంతాప సభకు వారు ముఖ్య అతిథులుగా హాజరై చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ సంతోష్ అకాల మరణం ఎంతో బాధ కలిగించిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కళాకారుడిగా ప్రజలను చైతన్యపర్చడంలో ఎంతో కృషి చేశారని కొనియాడారు. అనంతరం కళాకారులు పైలం సంతో్షపై రాసిన పాటలు పాడారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బొర్ర సుధాకర్, రావుల శ్రీనివా్సరెడ్డి, జి.వెంకటేశ్వర్లు, మంత్రవాది శ్రవణ్కుమార్, పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.