తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలి

ABN , First Publish Date - 2021-05-17T06:02:36+05:30 IST

రైతులు పండించిన దాళ్వా ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణం కొనుగోలు చేయాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జువ్వా రామకృష్ణ (రాంబాబు) డిమాండ్‌ చేశారు.

తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలి

టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జువ్వా రామకృష్ణ 

జి.కొండూరు, మే 16 : రైతులు పండించిన దాళ్వా ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణం కొనుగోలు చేయాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జువ్వా రామకృష్ణ (రాంబాబు) డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన టీడీపీ నేతలతో కలిసి వెలగలేరు తదితర ప్రాంతాల్లో ఉన్న ధాన్యం రాశులను పరిశీలించారు. రైతులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రైతుల్ని రోడ్డున పడేసిందని ఆవేదన చెందారు. దళారులు ఇష్టారాజ్యంగా రైతుల్ని దోసుకునేలా చేసిందన్నారు. సకాలంలో పంటను కొనుగోలు చేయకపోవడం వల్ల అకాల వర్షాలకు పంట తడిసి పోయి రైతులు ఇబ్బంది పడుతున్నారు. మిల్లర్లు, దళారులు కలిసి రైతుల కష్టం దోచుకుంటున్నారని ఆరోపించారు. బస్తాకు రూ.300 వరకు రైతులు నష్టపోవాల్సి వచ్చిందన్నారు. ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా తడిసిన ధాన్యంతో పాటు ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలన్నారు. టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి లంక రామకృష్ణ, ఆలూరి రాజబాబు, మంచినేని రాజశేఖర్‌, చల్లా వెంకటేశ్వరరావు, ఎర్రా గోపాలకృష్ణ, వీసం ప్రభాకర్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-17T06:02:36+05:30 IST