Tomorrow తిరుమలలో పద్మావతి పరిణయోత్సవాలు

ABN , First Publish Date - 2022-05-10T01:08:41+05:30 IST

తిరుమలలో మంగళవారం నుంచి మూడురోజుల పాటు పద్మావతి పరిణయోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు.

Tomorrow తిరుమలలో పద్మావతి పరిణయోత్సవాలు

తిరుమల: తిరుమలలో మంగళవారం నుంచి మూడురోజుల పాటు పద్మావతి పరిణయోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. 2019 మే నెలలో చివరిసారిగా ఈ ఉత్సవాలను నారాయణగిరి పార్కులో కన్నులపండువగా నిర్వహించారు. ఆ తర్వాత కొవిడ్‌ కారణంగా 2020లో ఈ ఉత్సవాలను టీటీడీ పూర్తిగా రద్దు చేసింది. 2021లో మాత్రం శ్రీవారి ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు.ప్రస్తుతం కొవిడ్‌ ప్రభావం తగ్గడంతో ఈ ఏడాది భక్తుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. ఇందులో భాగంగా నారాయణగిరి ఉద్యానవనంలో వివిధ రకాల ఫలాలు, సువాసన వెదజల్లే పుష్పాలతో భూలోక వైకుంఠాన్ని తలపించే రీతిలో అలంకరించిన అష్టలక్ష్మీ, దశావతార మండపంలో మంగళవారం నుంచి మూడు రోజులు పరిణయోత్సవాలను నిర్వహించనున్నారు. రెండేళ్ల తర్వాత భక్తుల మధ్య ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్న క్రమంలో టీటీడీ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసింది. 

Read more