జిల్లాకు పద్మం

ABN , First Publish Date - 2022-01-26T07:11:16+05:30 IST

తిరువూరుకు చెందిన నాదస్వర విద్యాంసుడు షేక్‌ హసన్‌ సాహెబ్‌కు పద్మశ్రీ పురస్కారాన్ని కేంద్రం ప్రకటించింది.

జిల్లాకు పద్మం

నాదస్వర విద్వాంసుడు హసన్‌ సాహెబ్‌కు పద్మశ్రీ

మరణానంతరం ప్రకటించిన కేంద్రం


విజయవాడ కల్చరల్‌, జనవరి 25 (ఆంధ్రజ్యోతి) : తిరువూరుకు చెందిన నాదస్వర విద్యాంసుడు షేక్‌ హసన్‌ సాహెబ్‌కు పద్మశ్రీ పురస్కారాన్ని కేంద్రం ప్రకటించింది. ఆయన గంపలగూడెం మండలం గోసవీడులో 1930లో జన్మించారు. నాదస్వరంలో తన ముద్రను వేసుకున్న ఆయన పేరు గోసవీడు షేక్‌ హసన్‌గా మారిపోయింది. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన చిన మౌలా సాహెబ్‌ వద్ద ఈయన నాదస్వర విద్యను అభ్యసించారు. భద్రాచలం, యాదగిరిగుట్ట దేవాలయాల ఆస్థాన విద్యాంసుడిగా చాలా కాలం పనిచేశారు. గత ఏడాది జూన్‌ 24వ తేదీన హసన్‌ తుదిశ్వాస విడిచారు. 

Updated Date - 2022-01-26T07:11:16+05:30 IST