పాడి రైతులకు సేవ చేయటం అదృష్టం

ABN , First Publish Date - 2022-07-05T06:53:04+05:30 IST

పాడి రైతులకు సేవ చేయటం అదృష్టం

పాడి రైతులకు సేవ చేయటం అదృష్టం
జంక్షన్‌ కాకాని కల్యాణ మండపంలో కేక్‌ కట్‌ చేస్తున్న చలసాని ఆంజనేయులు

  హనుమాన్‌జంక్షన్‌, జూలై 4 : దేశానికి పట్టుగొమ్మగా నిలబడిన పాడిరైతుకు సేవ చేసే భాగ్యం తనకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని విజయ డెయిరీ చైర్మన్‌ చలసాని ఆంజనేయులు అన్నారు. సోమ వారం స్థానిక కాకాని కల్యాణ మండపంలో హనుమాన్‌జంక్షన్‌ పాలశీతల కేంద్రం పరిధి లోని మిల్క్‌ సొసైటీ అధ్యక్షుల ఆధ్వర్యంలో విజయ డెయిరీ చెర్మన్‌ చలసాని ఆంజనే యులు జన్మదినం వేడుకను ఘనంగా నిర్వహించారు. ఆంజనేయులు చేత కేక్‌కట్‌ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చలసాని మాట్లాడుతూ పదవులు, డబ్బు ముఖ్యం కాదని రైతుల ఆదరాభిమానాలు పొందడం తనకు ఎక్కడలేని ఆనందాన్ని ఇస్తుందన్నారు. కార్యక్రమంలో హనుమాన్‌జంక్షన్‌  పాలశీతల కేంద్రం మేనేజర్‌ సంపత్‌కుమార్‌, గుడ్లవ ల్లేరు, పామర్రు, చిల్లకల్లు, పాలశీతల కేంద్రాల మేనేజర్లు తోట సత్యనారాయణ, సీహెచ్‌ కృష్ణగోపీనాథ్‌, కిలారి కిరణ్‌కుమార్‌,  పిన్నమనేని లక్ష్మీ ప్రసాద్‌,   రాగిపిండి లక్ష్మీరెడ్డి,  దయాల రాజేశ్వరావు, యలమం చిలి శ్రీరామచంద్రమూర్తి, తాడిరంగారావు, పలువురు సొసైటీ అధ్యక్షులు, పాలకేంద్రం సూపర్‌వైజర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-05T06:53:04+05:30 IST