ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
ABN , First Publish Date - 2022-05-24T05:21:30+05:30 IST
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కలెక్టర్ హనుమంతరావు సిబ్బందిని ఆదేశించారు. ములుగు మండలం తునికిబొల్లారం గ్రామంలో పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆయన తనిఖీ చేశారు. రైతుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అకాల వర్షాల భయం పొంచి ఉన్నందున వడ్ల తూకంలో వేగం పెంచాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రైస్మిల్లుకు తరలించాలి సూచించారు. కేంద్రాల వద్ద టార్పాలిన్ కవర్లను అందుబాటులో ఉంచాలని, వాహనాల కొరత ఉంటే స్థానికంగా అందుబాటులో ఉన్న వాహనాలను వినియోగించుకోవాలని ఆదేశించారు.
ములుగు, మే 23: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కలెక్టర్ హనుమంతరావు సిబ్బందిని ఆదేశించారు. ములుగు మండలం తునికిబొల్లారం గ్రామంలో పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆయన తనిఖీ చేశారు. రైతుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అకాల వర్షాల భయం పొంచి ఉన్నందున వడ్ల తూకంలో వేగం పెంచాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రైస్మిల్లుకు తరలించాలి సూచించారు. కేంద్రాల వద్ద టార్పాలిన్ కవర్లను అందుబాటులో ఉంచాలని, వాహనాల కొరత ఉంటే స్థానికంగా అందుబాటులో ఉన్న వాహనాలను వినియోగించుకోవాలని ఆదేశించారు.