పాదయాత్రకు సంఘీభావం తెలపండి

ABN , First Publish Date - 2021-11-28T02:58:49+05:30 IST

అమరావతి రైతులు నిర్వహిస్తున్న పాదయాత్రకు సంఘీభావం తెలపాలని మండల టీడీపీ అద్యక్షుడు పోలంరెడ్డి కోటేశ్వరరెడ్డి, జడ్పీటీసీ మాజీ సభ్యుడు ఏలేశ్వరం రామచంద్రయ్య నాయుడు అన్నారు.

పాదయాత్రకు సంఘీభావం తెలపండి
సమావేశంలో పాల్గొన్న టీడీపీ నేతలు

డక్కిలి, నవంబరు 27 : అమరావతి రైతులు నిర్వహిస్తున్న పాదయాత్రకు సంఘీభావం తెలపాలని  మండల టీడీపీ అద్యక్షుడు పోలంరెడ్డి కోటేశ్వరరెడ్డి,  జడ్పీటీసీ మాజీ సభ్యుడు ఏలేశ్వరం రామచంద్రయ్య నాయుడు అన్నారు. ఈ అంశంపై శనివారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ వ అమరావతి రైతులు నిర్వహిస్తున్న పాదయాత్రలో నియోజకవర్గం నుంచి వేలాదిగా ప్రజలు పాల్గొనేలా వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. డిసెంబరు 2, 3 తేదీల్లో అమరావతి రైతుల పాదయాత్ర వెంకటగిరి నియోజకవర్గంలో ప్రవేశిస్తుందని, గ్రామాల నుంచి పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొనాలని వారు కోరారు. అప్పటికి గానీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి కనువిప్పు కలగదన్నారు. అమరావతిలో రాజధానిని కాపాడుకోవాల్సిన భాద్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తుచేశారు.  కుమార్‌ యాదవ్‌, పోకూరు రమేష్‌ నాయుడు, సునీల్‌, కొండయ్య, పీపీ చౌదరి, శ్రీనివాసుల రెడ్డి, గరిటి చెంచయ్య, దాసరి మునెయ్య, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-28T02:58:49+05:30 IST