రావణ రాజ్యం పోవాలి... రామ రాజ్యం రావాలి..!

ABN , First Publish Date - 2022-08-16T04:21:42+05:30 IST

రాష్ట్రంలో రావణ రాజ్యం పోయి రామ రాజ్యం రావాలని తిరుమలేశ్వరుడిని వేడుకునేందుకు మండలంలోని లక్ష్మీనరసింహపురం గ్రామస్థులు సోమవారం తిరుమలకు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు.

రావణ రాజ్యం పోవాలి... రామ రాజ్యం రావాలి..!
తిరుమలకు పాదయాత్ర చేస్తున్న లక్ష్మీనరసింహపురం గ్రామస్థులు

మనుబోలు, ఆగస్టు 15: రాష్ట్రంలో రావణ రాజ్యం పోయి రామ రాజ్యం రావాలని తిరుమలేశ్వరుడిని వేడుకునేందుకు మండలంలోని లక్ష్మీనరసింహపురం గ్రామస్థులు సోమవారం తిరుమలకు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. గ్రామ సర్పంచు కడియాల సునీల్‌కుమార్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ పాదయాత్రలో పాల్గొన్న 20 మంది యువకులు మాట్లాడుతూ 2024లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడును చూడాలని కలియుగ దైవం వేంటేశ్వరస్వామిని వేడుకునేందుకు వెళుతున్నామన్నారు. 

Updated Date - 2022-08-16T04:21:42+05:30 IST