ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే పాదయాత్ర

ABN , First Publish Date - 2022-07-03T05:08:08+05:30 IST

ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే జనసేన పార్టీ పాదయాత్ర చేపట్టినట్లు పార్టీ దక్షిణ రాయల కోస్తాపార్లమెంటరీ సమ న్వయకర్త మైఫోర్స్‌ మహేష్‌ పేర్కొ న్నారు.

ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే పాదయాత్ర

మదనపల్లె అర్బన్‌, జూలై2: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే జనసేన పార్టీ పాదయాత్ర చేపట్టినట్లు పార్టీ దక్షిణ రాయల కోస్తాపార్లమెంటరీ సమ న్వయకర్త మైఫోర్స్‌ మహేష్‌ పేర్కొ న్నారు. మదనపల్లె నియోజకవర్గంలో  చేపట్టిన పాదయాత్రలో చాలా గ్రామా ల్లో అనేక సమస్యలు తన దృష్టకి వచ్చా యని ఆయన తెలిపారు. శనివారం స్థానిక ప్రెస్‌ క్లబ్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో పాద యాత్రలో ముఖ్యంగా వికలాంగులు, వితంతువులు, ఒంటరిమహిళ పింఛన్లు అందక పోవడం, పక్కాగృహాలు, రేషన్‌కార్డులు మంజూరు కాలేదని ప్రజలు వాపోయారన్నారు. సమావేశంలో పార్టీనాయకులు అమరనారాయణ, మల్లిక, శోభ, సందీప్‌రెడ్డి, జాఫర్‌, అయాజ్‌, చామంతుల సిద్ధయ్య, ఆర్‌ మధు, ప్రవీణ్‌, రూప, నరేష్‌, హార్ష. నరేంద్ర, దేవేంద్ర, రమేష్‌, సోము, ఖాదర్‌వలి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-03T05:08:08+05:30 IST