పాదయాత్రకు పల్లె వందనం

ABN , First Publish Date - 2021-11-15T01:47:04+05:30 IST

అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు ప్రకాశం జిల్లా ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఊళ్లకుఊళ్లు తరలివచ్చి

పాదయాత్రకు పల్లె వందనం

ఒంగోలు: అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు ప్రకాశం జిల్లా ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఊళ్లకుఊళ్లు తరలివచ్చి సంఘీభావం తెలిపి పాదయాత్ర బృందంతో కలిసి నడుస్తున్నారు. పలు గ్రామాల్లో ఎదురేగి హారతులు ఇచ్చి, కొబ్బరి కాయలు కొట్టి, గుమ్మడి కాయలతో దిష్టి తీసి ఆహ్వానం పలకడంతోపాటు పూల వర్షం కురిపిస్తూ ఆదరిస్తున్నారు. ఈనెల 1న తుళ్లూరు నుంచి ప్రారంభమైన మహాపాదయాత్ర 14వ రోజైన ఆదివారం కొండపి నియోజకవర్గంలో 13 కి.మీ సాగింది. ఆ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ డీఎస్‌బీవీ స్వామి నేతృత్వంలో వేలాది మంది ప్రజలు యాత్రలో పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-15T01:47:04+05:30 IST