చంద్రబాబు, లోకేశ్‌, దేవినేని ఉమా కోలుకోవాలని దుర్గగుడికి పాదయాత్ర

ABN , First Publish Date - 2022-01-22T06:20:14+05:30 IST

చంద్రబాబు, లోకేశ్‌, దేవినేని ఉమా కోలుకోవాలని దుర్గగుడికి పాదయాత్ర

చంద్రబాబు, లోకేశ్‌, దేవినేని ఉమా కోలుకోవాలని దుర్గగుడికి పాదయాత్ర

జి.కొండూరు/మైలవరం, జనవరి 21 : టీడీపీ అధినేత, చంద్రబాబు, మాజీ మంత్రులు నారా లోకేశ్‌, దేవినేని ఉమామహేశ్వరరావు త్వరగా కోలుకోవాలని మైలవరం ఏఎంసీ మాజీ చైర్మన్‌ ఉయ్యూరు వెంకట నరసింహారావు, టీడీపీ గ్రామ అధ్యక్షుడు పజ్జూరు వెంకటేశ్వరరావు (బుల్లి) ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు శుక్రవారం ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధికి పాదయాత్రగా వెళ్లారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ పాదయాత్రకు కొండపల్లి, ఇబ్రహీంపట్నం, గొల్లపూడిలోని టీడీపీ శ్రేణులు బ్రహ్మరథం పట్టారు. కరోనా నుంచి తమ నాయకులు త్వరగా కోలుకోవాలని దుర్గమ్మను మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పటాపంచల నరసింహారావు, అంకెం సురేశ్‌, బూర్సు శివ, బాధినేని సీతారామరాజు, కుక్కల శ్రీనివాసరావు, ఉయ్యూరు వెంకట రమణ, గణపతి, బడుగు రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

మైలవరంలో.. 

అలాగే, చంద్రబాబు, లోకేశ్‌, దేవినేని ఉమా కరోనా నుంచి కోలుకోవాలని మైలవరం ఎన్టీఆర్‌ విగ్రహం నుంచి దుర్గగుడి వరకూ శుక్రవారం పాదయాత్ర చేపట్టారు. టీడీపీ నాయకులు మైక్‌ బాబురావు, పత్తిపాటి ప్రభాకర్‌, రామకృష్ణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు తాతా పోతురాజు, పట్టణ అధ్యక్షుడు మల్లెల రాధాకృష్ణ జెండా ఊపి ప్రారంభించారు. రాయల లీలాప్రసాద్‌, దూరు బాలకృష్ణ, లంక లితీష్‌, బూదేటి రామారావు, మద్దినేని శ్రీనివాసరావు, జల్లి కృష్ణ, రోశయ్య, మల్లెల దుర్గారావు, వరుకూటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-01-22T06:20:14+05:30 IST