భారత్‌తో తొలి టెస్టుకు ముందు సౌతాఫ్రికాకు భారీ ఎదురుదెబ్బ

ABN , First Publish Date - 2021-12-22T01:16:16+05:30 IST

భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు సౌతాఫ్రికాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు పేసర్ అన్రిక్ నార్జ్ గాయం కారణంగా జట్టుకు దూరమైనట్టు క్రికెట్ సౌతాఫ్రికా

భారత్‌తో తొలి టెస్టుకు ముందు సౌతాఫ్రికాకు భారీ ఎదురుదెబ్బ

సెంచూరియన్: భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు సౌతాఫ్రికాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు పేసర్ అన్రిక్ నార్జ్ గాయం కారణంగా జట్టుకు దూరమైనట్టు క్రికెట్ సౌతాఫ్రికా తెలిపింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), టీ20 ప్రపంచకప్‌లో మంచి ఫామ్‌ కనబరిచిన నార్జ్ పేస్ ఎటాక్‌లో కీలక బౌలర్ అవుతాడని భావించారు. అయితే, గాయం కారణంగా అతడు తప్పుకోవడంతో జట్టుకు కష్టాలు తప్పనట్టే. దురదృష్టవశాత్తూ అతడు ఇంకా కోలుకోలేదని, నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నామని సౌతాఫ్రికా బోర్డు పేర్కొంది. అతడి స్థానాన్ని భర్తీ చేసే విషయంపై బోర్డు ఇంకా ఇలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. మరోవైపు, దక్షిణాఫ్రికాలో ఉన్న భారత జట్టు ప్రాక్టీస్‌లో చెమటోడుస్తోంది.

Updated Date - 2021-12-22T01:16:16+05:30 IST