ఆర్థికశాఖకు కేంద్రం రాసిన మరోలేఖను బయటపెట్టిన పయ్యావుల

ABN , First Publish Date - 2021-07-10T17:48:11+05:30 IST

ఏపీ ఆర్ధిక శాఖ వ్యవహరాలు, అస్తవ్యస్థ విధానాలపై పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ దాడి కొనసాగుతోంది.

ఆర్థికశాఖకు కేంద్రం రాసిన మరోలేఖను బయటపెట్టిన పయ్యావుల

అమరావతి: ఏపీ ఆర్ధిక శాఖ వ్యవహరాలు, అస్తవ్యస్థ విధానాలపై  పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ దాడి కొనసాగుతోంది. తాజాగా ఏపీ ఆర్ధిక శాఖకు కేంద్రం రాసిన మరో లేఖను పయ్యావుల విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న రుణాల విషయంలో అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఆర్ధిక శాఖకు కేంద్రం రాసిన లేఖను బయటపెట్టారు. రూ.17,923.94 కోట్లను పరిధికి మించి అప్పులు చేశారంటూ లేఖలో కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిపారు. రుణాలు.. కేంద్ర అభ్యంతరాలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఆర్ధిక శాఖ వివరణ కోరడంపై ఆర్ధిక శాఖ స్పందించాలన్నారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవహారాలు అస్తవ్యస్తంగా ఉన్నాయని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లేఖతో స్పష్టమైందని పేర్కొన్నారు. రాష్ట్రం చేసే ఆర్ధిక తప్పిదాలపై కేందమైనా సమాధానం చెప్పాల్సిందే అని పయ్యావుల స్పష్టం చేశారు. 

Updated Date - 2021-07-10T17:48:11+05:30 IST