పాడి రైతుల ముంగిటకే పశువైద్యం : మేకపాటి
ABN , First Publish Date - 2022-05-27T03:06:35+05:30 IST
పాడి రైతుల ఇంటి ముంగిటకే పశు వైద్యసేవలను అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు.
ఉదయగిరి రూరల్, మే 2: పాడి రైతుల ఇంటి ముంగిటకే పశు వైద్యసేవలను అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన డాక్టర్ వైఎస్ఆర్ పశు సంచార వైద్యసేవ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ వాహనం ద్వారా సకాలంలో పశువులకు వ్యాధి నిర్థారణ పరీక్షలు నిర్వహించి, మెరుగైన చికిత్స అందిస్తారని తెలిపారు. రైతులు ఈ వాహన సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్థక శాఖ అధికారులు, నాయకులు, సిబ్బంది తదితరులు పాల్గన్నారు.