టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తల దాడి
ABN , First Publish Date - 2020-09-21T19:59:46+05:30 IST
కర్నూల్ జిల్లాలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు.
కర్నూల్: జిల్లాలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. కొసిగి మండలం, దొడ్డి బెళగల్లో టీడీపీ కార్యకర్తలపై వైపీసీ కార్యకర్తలు విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. అన్నదమ్ముల మధ్య స్థల వివాదంలో ఈ ఘర్షణ జరిగింది. వైసీపీ మాజీ సర్పంచ్ నర్సన్న, అతని తమ్ముడు టీడీపీ కార్యకర్త సాయన్నల మధ్య చాలా కాలంగా వివాదం జరుగుతోంది.
సోమవారం ఉదయం స్థలం విషయంలో అన్నదమ్ముల మధ్య మరోసారి గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో నర్సన్న తన అనుచరులతో సాయన్న కుటుంబ సభ్యులపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిపై కూడా దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బాధితులు పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.