పి.గన్నవరం వైసీపీలో చందాల రచ్చ

ABN , First Publish Date - 2021-11-17T00:29:48+05:30 IST

జిల్లాలోని పి.గన్నవరంలో వైసీపీ నాయకుల చందాల దందాపై

పి.గన్నవరం వైసీపీలో చందాల రచ్చ

తూర్పు గోదావరి: జిల్లాలోని పి.గన్నవరంలో వైసీపీ నాయకుల చందాల దందాపై రచ్చ జరుగుతోంది. పట్టణంలో కొన్నిరోజల క్రితం వైసీపీ ప్రతినిధి కుమార్తె వివాహం జరిగింది. ఆ వివాహానికి చందాలు వసూలు చేశారంటూ చెప్పిన వైసీపీ నేత కొండల్ రావు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చందాల దందాపై వైసీపీ నేత చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఇసుక దందా, సెటిల్మెంట్లు, వసూళ్లతో వైసీపీ నేతలు బిజీగా ఉన్నారంటూ వీడియోలో వ్యాఖ్యానించారు. నగరం వ్యవసాయ మర్కెట్ కమిటీ కమిటీ చైర్మన్‌గా కొండల్ రావు పనిచేస్తున్నారు. 


Updated Date - 2021-11-17T00:29:48+05:30 IST