బందరులో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ప్రారంభం
ABN , First Publish Date - 2021-06-24T07:03:58+05:30 IST
చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో కరోనా బారిన పడిన రోగులకు ఆక్సిజన్ అందిస్తున్నామని జనసేన నియోజక వర్గ ఇన్చార్జి బండి రామకృష్ణ అన్నారు. ఆంధ్రజాతీయ కళాశాలకు సమీపంలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ బ్యాంక్ను బండి రామకృష్ణ బుధవారం ప్రారంభించి ప్రసంగించారు.
మచిలీపట్నం టౌన్, జూన్ 23 : చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో కరోనా బారిన పడిన రోగులకు ఆక్సిజన్ అందిస్తున్నామని జనసేన నియోజక వర్గ ఇన్చార్జి బండి రామకృష్ణ అన్నారు. ఆంధ్రజాతీయ కళాశాలకు సమీపంలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ బ్యాంక్ను బండి రామకృష్ణ బుధవారం ప్రారంభించి ప్రసంగించారు. పార్టీలకతీతంగా అందరికీ ఆక్సిజన్ బ్యాంక్ ద్వారా సేవలం దిస్తున్నామన్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఏవిధమైన సేవలం దించారో అదే విధమైన సేవలు కొవిడ్ రోగులకు అందిస్తున్నామన్నారు. గడ్డం రాజు, వంపుగడల చౌదరి, కూనపరెడ్డి ప్రసాద్, మహమ్మద్ సమీర్, చింతల వంశీ, మోకా రవి, చలం, తాతి పాల్గొన్నారు.