ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరత లేదు: హరీశ్‌రావు

ABN , First Publish Date - 2022-01-31T02:47:23+05:30 IST

రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రస్తుతం ఆక్సిజన్‌ కొరత లేదని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఏరియా ఆసుపత్రిలో మహీంద్రా

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరత లేదు: హరీశ్‌రావు

జహీరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రస్తుతం ఆక్సిజన్‌ కొరత లేదని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ ఏరియా ఆసుపత్రిలో మహీంద్రా అండ్‌ మహీంద్రా సౌజన్యంతో రూ.1.05 కోట్లతో సమకూర్చిన ఆక్సిజన్‌ జనరేట్‌ ప్లాంట్‌ను ఆదివారం హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సెకండ్‌ వేవ్‌లో 550 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అవసరముండగా 200 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ మాత్రమే అందుబాటులో ఉండేదన్నారు. మిగతా 350 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ కోసం తమిళనాడు, గోవా రాష్ట్రాల నుంచి తెప్పించుకోవడానికి నానా కష్టాలు పడ్డామని తెలిపారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులను అధిగమించేందుకు సీఎం కేసీఆర్‌ 550 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తిని రాష్ట్రంలో పెంచాలని ఆదేశించారని తెలిపారు.

Updated Date - 2022-01-31T02:47:23+05:30 IST