ఇజ్రాయెల్ నుంచి భారత్కు చేరిన వైద్య సాయం
ABN , First Publish Date - 2021-05-11T02:56:44+05:30 IST
భారత్లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో సాయం చేయడానికి పలు దేశాలు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇజ్రాయెల్ దేశం కూడా భారత్కు వైద్యసాయం అందిస్తామని చెప్పింది.
న్యూఢిల్లీ: భారత్లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో సాయం చేయడానికి పలు దేశాలు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇజ్రాయెల్ దేశం కూడా భారత్కు వైద్యసాయం అందిస్తామని చెప్పింది. తాజాగా ఈ దేశం నుంచి 1300 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, ఇతర వస్తువులు భారత్కు చేరుకున్నాయి. ఇవన్నీ ఆదివారం రాత్రి భారత్కు చేరుకున్నట్లు సమాచారం. ఈ మెడికల్ వస్తువులు ఉన్న విమానం ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ చేరుకుంది. భారత్లో కరోనా విలయంతో జరుగుతున్న పోరాటానికి ఇజ్రాయెల్ మద్దతిస్తుందని, ఈ పోరాటంలో సహకారం అందించేందుకు నిపుణుల బృందాన్ని పంపుతుందని భారత్లో ఇజ్రాయెల్ రాయబారి రాన్ మాల్కా తెలిపారు. అలాగే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అభివృద్ధి చేయడానికి కూడా ఈ నిపుణులు కృషి చేస్తారట.