సొంతంగా రహదారి నిర్మాణం
ABN , First Publish Date - 2020-07-26T10:53:40+05:30 IST
మండలంలోని మూరుమూల బస్కీ పంచాయతీ పరిధిలోని పిరిబంద గోందన గ్రామాల ప్రజలు సొంతంగా రహదారిని ఏర్పాటు ..
అరకు రూరల్, జూలై 25: మండలంలోని మూరుమూల బస్కీ పంచాయతీ పరిధిలోని పిరిబంద గోందన గ్రామాల ప్రజలు సొంతంగా రహదారిని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈమేరకు శనివారం గ్రామస్థులు కలసి రహదారి పనులు ప్రారంభించారు. ఈరెండు గ్రామాల్లో 30 పీవీటీజీ కుటుంబాలు నివసిస్తున్నాయని బస్కీ పంచాయతీ ఎంపీటీసీ మాజీ సభ్యుడు బురిడి దశరథ్ తెలిపారు. రహదారి సౌకర్యం కల్పించాలని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ప్రయోజనం లేకపోవడంతో రెండు గ్రామాల గిరిజనులు సొంతంగా రహదారి నిర్మాణం ప్రారంభించినట్టు గ్రామస్థులు సమర్డి ఆనంద్, సమర్డి కామేష్ తెలిపారు.