Pakistan: రోడ్డు ప్రమాదంలో 27 మంది మ‌ృతి

ABN , First Publish Date - 2021-07-19T17:18:39+05:30 IST

పాకిస్థాన్ దేశంలో సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 27 మంది మరణించగా....

Pakistan: రోడ్డు ప్రమాదంలో 27 మంది మ‌ృతి

40 మంది ప్రయాణికులకు గాయాలు

ఇస్లామాబాద్ (పాకిస్థాన్): పాకిస్థాన్ దేశంలో సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 27 మంది మరణించగా, మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు.పాకిస్థాన్ దేశంలోని ఇండస్ జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న ప్రయాణికుల బస్సు ట్రక్కును ఢీకొంది.సాయల్ కోట్ నుంచి రాజాన్ పూర్ కు వెళుతున్న ప్రయాణికుల బస్సు డేరా ఘాజీ ఖాన్ ఏరియా వద్ద ప్రమాదానికి గురైంది. ఈ రోడ్డు ప్రమాదంలో 27 మంది ప్రయాణికులు మరణించారని కమిషనర్ డాక్టర్ ఇర్షాద్ అహ్మద్ చెప్పారు. ఈ ప్రమాదంలో గాయపడిన 40 మందిని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. ఈదుల్ అజాహా పండుగ కోసం స్వగ్రామానికి వస్తుండగా ఈ బస్సు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు పాకిస్థాన్ మంత్రి షేఖ్ రషీద్ తన ప్రగాఢ సంతాపం తెలిపారు.క్షతగాత్రులకు తక్షణం వైద్య చికిత్స  అందించేందుకు డేరా ఘాజి ఖాన్ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స విభాగాన్ని ఏర్పాటు చేశారు. 


Updated Date - 2021-07-19T17:18:39+05:30 IST