ప్రేమికుల రోజున యువతి అదృశ్యం.. ప్రియుడిని కలిసేందుకు వెళ్లిన ఆమె ఏ స్థితిలో కనబడిదంటే..

ABN , First Publish Date - 2022-02-28T05:40:12+05:30 IST

ప్రేమికుల రోజుని తన ప్రియుడితో జరుపుకోవాలని ఒక యువతి ఢిల్లీ నుంచి ప్రయాగ్‌రాజ్ వచ్చింది. తన ప్రియుడితో కలిసి నగరమంతా తిరిగింది. ఆ తరువాత అతని ఇంటికి వెళ్లింది. యువతి బాత్రూమ్‌లో ఉండగా ప్రియుడు ఆమె మొబైల్ చెక్ చేశాడు. ఆమె మరికొందరు యువకులతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు...

ప్రేమికుల రోజున యువతి అదృశ్యం.. ప్రియుడిని కలిసేందుకు వెళ్లిన ఆమె ఏ స్థితిలో కనబడిదంటే..

ప్రేమికుల రోజుని తన ప్రియుడితో జరుపుకోవాలని ఒక యువతి ఢిల్లీ నుంచి ప్రయాగ్‌రాజ్ వచ్చింది. తన ప్రియుడితో కలిసి నగరమంతా తిరిగింది. ఆ తరువాత అతని ఇంటికి వెళ్లింది. యువతి బాత్రూమ్‌లో ఉండగా ప్రియుడు ఆమె మొబైల్ చెక్ చేశాడు. ఆమె మరికొందరు యువకులతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు చూశాడు. వెంటనే ఉన్మాదిలా మారిపోయాడు. 


వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్లోని అలహాబాద్ నగరంలో పోలీసులకు ఒక యువతి మృతదేహం లభించింది. ఆ శవం చేతి మీద `రవి` అని రాసి ఉన్న టాటూ చూసి విచారణ ప్రారంభించారు. ఆమె ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ లిస్ట్‌లో రవి అనే పేరుతో ఏడుగురు ఉన్నారు. వారందరినీ విచారణ చేయగా రవి ఠాకూర్ అనే వ్యక్తి నిందితుడని తేలింది. రవి ఠాకూర్‌తో వాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకునేందుకు ఢిల్లీకి చెందిన షాలినీ అనే యువతి ఈ నెల 13న ప్రయాగరాజ్ వెళ్లింది. ప్రియుడి రూమ్‌కు వెళ్లి ఫ్రెష్ అయ్యేందుకు బ్రాతూమ్‌లోకి వెళ్లింది. 


ఆ సమయంలో షాలిని మొబైల్‌ను రవి పరిశీలించాడు. ఆమె మరికొందరు యువకులతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు చూసి రవికి పట్టరాని కోపం వచ్చింది. అనుమానంతో షాలిని బయటకు రాగానే గొంతుకోసి చంపాడు. అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో వేసి.. కుట్టి ఒక పోలో గ్రౌండ్‌లోని బావిలో పడేశాడు. మృతదేహం బయటపడడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. 


నిందితుడు రవి ఠాకూర్ బీహార్‌లోని జెహనాబాద్‌కు చెందిన వ్యక్తి. ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌లోని సివిల్‌లైన్స్‌లోని లోకో కాలనీలో నివసిస్తున్నాడు. రవి, షాలిని నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తను షాలినిని విపరీతంగా ప్రేమించానని, ఆమె చేసిన ద్రోహం తట్టుకోలేక హత్య చేశానని పోలీసుల ఎదుట రవి అంగీకరించాడు.  


Updated Date - 2022-02-28T05:40:12+05:30 IST