సహాయ కార్యక్రమాల్లో లక్షపైనే కార్యకర్తలు: ఆరెస్సెస్‌

ABN , First Publish Date - 2020-04-03T09:56:15+05:30 IST

దేశం ఆపత్కాలంలో ఉన్న వేళ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో లక్షపైనే ఆరెస్సెస్‌ కార్యకర్తలు సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారని ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి భయ్యాజీ జోషి...

సహాయ కార్యక్రమాల్లో లక్షపైనే కార్యకర్తలు: ఆరెస్సెస్‌

నాగ్‌పూర్‌, ఏప్రిల్‌ 2 : దేశం ఆపత్కాలంలో ఉన్న వేళ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో లక్షపైనే ఆరెస్సెస్‌ కార్యకర్తలు సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారని ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి భయ్యాజీ జోషి తెలిపారు. అన్నార్తులకు, నిరాశ్రయులకు ఆహారం, నిత్యావసర సరుకులు అందించడంతో పాటు ఆస్పత్రుల్లో కూడా సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారని ఆయన చెప్పారు. రామనవమి సందర్భంగా ఆన్‌లైన్‌లో ఆయన ప్రసంగించారు. ఈ సంక్షోభ సమయంలో ప్రభుత్వ, వైద్యుల ఆదేశాలకు లోబడి ఉండడం అత్యవసరమని అన్నారు. మరో రెండు నెలల వరకు ప్రభుత్వం చెప్పినట్లు వింటే, మునుపటిలాగే మనమంతా మళ్లీ సాధారణ జీవితం గడపుతామని సూచించారు.

Updated Date - 2020-04-03T09:56:15+05:30 IST