బీజేపీ పాలనలో ఏ ఆలయమైనా బాగుపడిందా?: ఓవీ రమణ

ABN , First Publish Date - 2020-09-22T17:55:55+05:30 IST

బీజేపీ పాలనలో ఏ ఆలయమైనా బాగుపడిందా? అని ఓవీ రమణ ప్రశ్నించారు.

బీజేపీ పాలనలో ఏ ఆలయమైనా బాగుపడిందా?: ఓవీ రమణ

తిరుపతి: బీజేపీ పాలనలో ఏ ఆలయమైనా బాగుపడిందా? అని ఓవీ రమణ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడేవారు మనుషులేనా? అని అన్నారు. తిరుమల సంప్రదాయాలను ఎవరైనా గౌరవించాల్సిందేనన్నారు.


టీటీడీ భూముల్ని ఎందుకు కాపాడలేకపోతున్నారని ఓవీ రమణ ప్రశ్నించారు. రాజకీయాలు ఉంటే వేరాలా చేసుకోవాలని, వెంకటేశ్వర స్వామిని వివాదాల్లోకి తీసుకురావద్దని, సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. స్వామి పవిత్రతను కాపాడాలన్నారు. మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యల్ని తాను సమర్థించనని ఓవీ రమణ స్పష్టం చేశారు.

Updated Date - 2020-09-22T17:55:55+05:30 IST