ఇద్దరు ఏఎస్పీలకు మహోన్నత సేవా పతకాలు

ABN , First Publish Date - 2021-04-13T08:17:36+05:30 IST

ఉత్తమ సేవలకు ఏటా ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అందించే సేవా పతకాలకు ఈదఫా కూడా తిరుపతి అర్బన్‌ జిల్లా పోలీసులు ఎంపికయ్యారు.

ఇద్దరు ఏఎస్పీలకు మహోన్నత సేవా పతకాలు
ఏఎస్పీలు మునిరామయ్య, శ్రీనివాస్‌

తిరుపతి(నేరవిభాగం), ఏప్రిల్‌ 12: ఉత్తమ సేవలకు ఏటా ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అందించే సేవా పతకాలకు ఈదఫా కూడా తిరుపతి అర్బన్‌ జిల్లా పోలీసులు ఎంపికయ్యారు. తిరుమల అదనపు ఎస్పీ ఎం.మునిరామయ్య, తిరుపతి ఏసీబీ అదనపు ఎస్పీ ఎం.శ్రీనివాస్‌ రాష్ట్ర పోలీసు మహోన్నత సేవా పతకాలకు ఎంపికయ్యారు. అలాగే సీఐడీ తిరుపతి రీజనల్‌ డీఎస్పీ జి.రవికుమార్‌, డీసీఆర్‌బీ ఏఎస్‌ఐ ఎస్‌.మున్వర్‌బాషా, ఏసీబీ హెడ్‌ కానిస్టేబుల్‌ నరేంద్రకుమార్‌ రాష్ట్ర పోలీసు ఉత్తమ సేవా పతకాలకు ఎంపికయ్యారు. తిరుపతి రైల్వే సీఐ పి.రామకృష్ణ, ఏర్పేడు పోలీసు స్టేషన్‌ ఆర్పీఎస్‌ఐ ఎస్‌. రామచంద్రనాయక్‌, ఆర్పీ హెడ్‌కానిస్టేబుల్‌ ఎస్‌.చంద్రకళ, రెడ్‌శాండిల్‌ టాస్క్‌ఫోర్స్‌ ఏఆర్‌ పీసీ పి.హరిబాబు, అర్బన్‌జిల్లా పరిధిలోని ఏఎస్‌ఐలు టీఎన్‌ శ్రీధర్‌, డి.ప్రసాద్‌రాజు, ఏఆర్‌ హెడ్‌కానిస్టేబుల్‌ ఎస్‌.వెంకట పురుషోత్తమరావు, కానిస్టేబుల్‌ పి.ప్రభాకర్‌, ఇంటెలిజెన్స్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ ఏఆర్‌ కరుణాకర్‌లు కఠిన సేవా పతకాలకు ఎంపికయ్యారు. టీటీడీలో పనిచేస్తున్న స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ శోభన్‌బాబు, తిరుపతి ఏసీబీ హెడ్‌ కానిస్టేబుల్‌ జ్యోతిప్రసాద్‌ సేవాపతకాలకు ఎంపికయ్యారు. 

Updated Date - 2021-04-13T08:17:36+05:30 IST