సజ్జల కాళ్లపై పడ్డ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు
ABN , First Publish Date - 2022-02-05T23:00:45+05:30 IST
తమకు న్యాయం చేయలంటూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు
అమరావతి: తమకు న్యాయం చేయలంటూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కాళ్లపై ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పడ్డారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కార్పొరేషన్లో చేర్చాం కదా అని సజ్జల పేర్కొన్నారు. దానివల్ల ఒకటో తేదీన జీతం తప్ప ఎలాంటి న్యాయం జరగలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సెక్రటేరియట్లోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై సజ్జల ఆరా తీశారు. న్యాయం చేయాలని సజ్జల కళ్లపై ఔట్ సోర్సింగ్ మహిళా ఉద్యోగిని పడ్డారు.