ఎన్నికలు ఎప్పుడు జరిగినా మాదే అధికారం

ABN , First Publish Date - 2022-05-19T07:45:35+05:30 IST

: రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీ సునాయాసంగా అధికారం చేపడుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు.

ఎన్నికలు ఎప్పుడు జరిగినా మాదే అధికారం

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు


శ్రీకాళహస్తి, మే 18: రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీ సునాయాసంగా అధికారం చేపడుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు.శ్రీకాళహస్తి మండలం ఊరందూరులో బుధవారం జరిగిన మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఉత్తర క్రియలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ మూడేళ్ల పాలనలో  ఏ ఒక్క వర్గం కానీ...ఏ వ్యక్తి కానీ సంతృప్తిగా లేరన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు వేగంగా  మారి టీడీపీకి అనుకూలి స్తున్నాయన్నారు.మాజీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర,  మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ,టీడీపీ నేతలు నరసింహయాదవ్‌, గాలి చలపతి నాయుడు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-19T07:45:35+05:30 IST