మాది సెక్యూలర్ పార్టీ: పెద్దిరెడ్డి

ABN , First Publish Date - 2021-10-10T00:05:31+05:30 IST

తమది సెక్యూలర్ పార్టీ అని తమకు కులాలు, మతాలు లేవని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.

మాది సెక్యూలర్ పార్టీ: పెద్దిరెడ్డి

కడప: తమది సెక్యూలర్ పార్టీ అని తమకు కులాలు, మతాలు లేవని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హిందు మతం అడ్డం పెట్టుకొని బీజేపీ రాజకీయం చేస్తోందని తప్పుబట్టారు. బద్వేలు ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పునాదులు కదిలిపోయాయని, బీజేపీ బద్వేలులో అడ్రస్ లేదని ఎద్దేవాచేశారు. ఇలాంటి పార్టీలతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి జగన్ కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలు చూడకుండా సంక్షేమం అందిస్తున్నారని చెప్పారు. బద్వేలు నియోజకవర్గ అభివృద్ధికి రూ.792 కోట్లు కేటాయించామని తెలిపారు. నియోజకవర్గ పరిధిలో ఐదు వేల ఇళ్లు ఇచ్చామని, నియోజకవర్గ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రామచంద్రారెడ్డి ఉద్ఘాటించారు.

Updated Date - 2021-10-10T00:05:31+05:30 IST