నాగపూర్ (మహారాష్ట్ర): ఓటీటీ, మొబైల్ కంటెంట్లను తప్పనిసరిగా నియంత్రించాలని రాష్ట్రీయ స్వయంసేవక్ చీఫ్ మోహన్ భగవత్ సూచించారు.దేశానికి హాని కలిగించే ఓటీటీ ప్లాట్ఫారమ్లలో చూపించే కంటెంట్పై నియంత్రణ లేదని భగవత్ చెప్పారు.మహారాష్ట్రలోని నాగ్పూర్లో విజయదశమి వేడుకల్లో మోహన్ భగవత్ మాట్లాడారు. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి తర్వాత దాదాపు ప్రతీ వారికి మొబైల్ ఫోన్ ఉందని, వారు సెల్ ఫోన్లలో చూసేది నియంత్రించాలని భగవత్ సూచించారు.భారతదేశంలో డ్రగ్స్ వాడకం కూడా పెరుగుతోందని భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు.
పాకిస్థాన్ తుపాకుల వినియోగంపై శిక్షణ ఇచ్చి, సరిహద్దుల ద్వారా ఉగ్రవాదులను పంపించి టెర్రర్ కార్యకలాపాలను ప్రోత్సహిస్తుందని భగవత్ చెప్పారు. క్రిప్టోకరెన్సీ, బిట్ కాయిన్ వంటివి దేశాల ఆర్థికవ్యవస్థను అస్థిరపరుస్తుందని, వీటిని ప్రభుత్వం నియంత్రించాలని కోరారు. భారతీయ విలువల వ్యవస్థపై పలు రకాల దాడులు సాగుతున్నాయని, ఇంట్లోని పిల్లలకు నైతిక విలువలు నేర్పాలని ఆయన సలహా ఇచ్చారు.