పురాతన పెంకుటిల్లుకూ ఓటీఎస్..!
ABN , First Publish Date - 2021-12-09T09:02:51+05:30 IST
వైసీపీ సర్కారు ప్రవేశపెట్టిన వన్టైమ్ సెటిల్మెంట్(ఓటీఎస్) కార్యక్రమంలో
కూచిపూడి, డిసెంబరు 8: వైసీపీ సర్కారు ప్రవేశపెట్టిన వన్టైమ్ సెటిల్మెంట్(ఓటీఎస్) కార్యక్రమంలో చిత్ర విచిత్రా లుచోటుచేసుకుంటున్నాయి. ఎప్పుడో 100 ఏళ్ల క్రితం నిర్మించి న పెంకుటిల్లును సైతం అధికారులు ఓటీఎ్సలో చేర్చారు. ఇది పక్కా ఇల్లా.. పెంకుటిల్లా అని చూడకుండానే వృద్ధ దంపతుల ఇంటికి వెళ్లి ఓటీఎ్సలో భాగంగా డబ్బులు చెల్లించాలని చెప్పడమే కాకుండా ఆ ఇంటి కొలతలు కూడా తీయడానికి సిద్ధమయ్యారు. దీందో ఆ వృద్ధ దంపతులు కంగుతిన్నారు.
కృష్ణాజిల్లా మొవ్వ మండలం పెదముత్తేవి గ్రామంలో 96 ఏళ్ల క్రితం నిర్మించిన పెంకుటిల్లును లింగమనేని వెంకటసుబ్బమ్మ, రాజారావు వద్ద నుంచి 1981లో దండమూడి రాజగోపాలరావు-లక్ష్మి దంపతులు కొనుగోలు చేశారు. అప్పటి నుంచి అందులోనే నివసిస్తున్నారు. అయితే ఓటీఎ్సలో భాగంగా 1996-97లో ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన గృహాల జాబితాలో రాజగోపాలరావు(పెంకుటిల్లు) పేరును కూడా అధికారులు చేర్చారు.
దీంతో వలంటీర్ తేజస్వి జాబితాతో మీ పేరు ఉందని వారికి చెప్పింది. సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ బుర్రే శ్రీధర్ వచ్చి ఇంటి కొలతలు తీయాలని చెప్పటంతో దంపతులు అవాక్కయ్యారు. ఆ ఇంటి పై ఎలాంటి రుణం పొందలేదని వారికి చెప్పే ప్రయత్నం చేశారు. ఈ విషయమై హౌసింగ్ ఏఈ మల్లిఖార్జునరావును వివరణ కోరగా.. దీనిపై విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు.