శరవేగంగా ఓటీఎస్‌ కలెక్షన్లు

ABN , First Publish Date - 2022-01-18T04:03:50+05:30 IST

స్థానిక తహసీల్దారు కటారి జయజయరావు, రెవెన్యూ, సచివాలయ సిబ్బంది, వైఎస్‌ఆర్‌ క్రాంతిపథం సిబ్బంది సోమవారం ఓటీఎస్‌ స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు.

శరవేగంగా ఓటీఎస్‌ కలెక్షన్లు
మహిళకు రుణవిముక్తి పత్రం అందజేస్తున్న తహసీల్దారు జయజయరావు

 ఒక్కరోజే రూ.5.96 లక్షల వసూలు 

పెళ్లకూరు, జనవరి 17 :   స్థానిక తహసీల్దారు కటారి జయజయరావు, రెవెన్యూ, సచివాలయ సిబ్బంది, వైఎస్‌ఆర్‌ క్రాంతిపథం సిబ్బంది సోమవారం ఓటీఎస్‌ స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు.  మండలంలో 13 సచివాలయాలుండగా, ఒక్కో సచివాలయం పరిధిలో 30 మంది నుంచి నగదు  వసూలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దారు  మాట్లాడుతూ  బంగారమ్మపేట, శిరసనంబేడు, తాళ్వాయిపాడు, కానూరు, చావాలి, పాలచ్చూరు, పుల్లూరు సచివాలయాలను సందర్శించినట్లు తెలిపారు.  సోమవారం  63 మంది నుంచి రూ 5,96,370 నగదు వసూలు చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో 134 మందికి రిజిస్ట్రేషన్లు చేసినట్లు తెలిపారు. 

Updated Date - 2022-01-18T04:03:50+05:30 IST