ప్లీనరీతో ఒరిగిందేమీ లేదు: సీపీఐ రామకృష్ణ
ABN , First Publish Date - 2022-07-10T01:04:34+05:30 IST
Amaravathi: వైసీపీ ప్లీనరీ వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. ప్లీనరీకి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలంతా జగన్ మోహన్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తడం తప్ప,
Amaravathi: వైసీపీ ప్లీనరీ వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. ప్లీనరీకి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలంతా జగన్ మోహన్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తడం తప్ప, కేంద్రం ఏపీకి చేస్తున్న అన్యాయంపై మాట్లాడలేదని విమర్శించారు. వైసీపీ ప్లీనరీని జరిపింది జగన్రెడ్డిని శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోడానికేనా? రాష్ట్రాభివృద్ధి గురించి ఏమైనా చర్చించారా? అని ప్రశ్నించారు. సీఎం హోదాలో ఉండి మీడియాను తిట్టడం, బెదిరించడం మానుకోవాలని సూచించారు.
రూ.25 కోట్లు వృథా
ప్లీనరీ పేరుతో రూ.25కోట్లు వృథా చేశారని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్తు గురించి మాట్లాడకుండ.. చంద్రబాబు, లోకేష్లను తిట్టేందుకే ప్లీనరీ పెట్టినట్టుందని అన్నారు. ప్రజలు జగన్ పాలనను గమనిస్తున్నారని, త్వరలో గద్దె దింపడం ఖాయమన్నారు.