లారీ బీభత్సం.. తల్లీకూతుళ్ల మృతి..

ABN , First Publish Date - 2021-09-14T23:38:48+05:30 IST

గుంటూరు: తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం ఓ లారీ బీభత్సం సృష్టించింది. స్కూటీపై వెళ్తున్న తల్లీకూతుళ్ల మీదకు వేగంగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తల్లీకూతుళ్లయిన షేక్ హసీనా సుల్తానా(34), షేక్ అప్సా

లారీ బీభత్సం.. తల్లీకూతుళ్ల మృతి..

గుంటూరు: తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం ఓ లారీ బీభత్సం సృష్టించింది. స్కూటీపై వెళ్తున్న తల్లీకూతుళ్ల మీదకు వేగంగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తల్లీకూతుళ్లయిన షేక్ హసీనా సుల్తానా(34), షేక్ అప్సా (10).. అక్కడికక్కడే మృతి చెందారు. కుమార్తెను స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లారీ మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-09-14T23:38:48+05:30 IST