ఉద్రిక్తంగా ఉస్మానియా యూనివర్సిటీ
ABN , First Publish Date - 2022-04-30T23:34:10+05:30 IST
పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్వాదంతో ఉస్మానియా యూనివర్సిటీ ఉద్రిక్తంగా మారింది.
హైదరాబాద్: ఓయూలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటించద్దని విద్యార్థులు నిరసన చేపట్టారు. ఈ నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఉస్మానియా యూనివర్సిటీ ఉద్రిక్తంగా మారింది. ఓయూలో రాహుల్ గాంధీ పర్యటనను అడ్డుకోవాలని ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని పోలీసులు విద్యార్థులను హెచ్చరించారు. ప్రభుత్వ వైఖరిపై ఓయూ నిరుద్యోగ జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ఎదుట సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు విద్యార్థులు యత్నించారు.