Mumbai: విధాన్ భవన్ ఎదుట వ్యక్తి ఆత్మాహుతి యత్నం

ABN , First Publish Date - 2022-08-23T23:08:41+05:30 IST

మహారాష్ట్రలోని ఒస్మానాబాద్‌కు చెందిన ఒక యువకుడు మంగళవారం ఉదయం ముంబై విధాన్ భవన్ వెలుప..

Mumbai: విధాన్ భవన్ ఎదుట వ్యక్తి ఆత్మాహుతి యత్నం

ముంబై: మహారాష్ట్రలోని ఒస్మానాబాద్‌ (Osmananabad)కు చెందిన ఒక యువకుడు మంగళవారం ఉదయం ముంబై విధాన్ భవన్ (Vidhan bhavan) వెలుపల నిప్పంటించుకుని ఆత్మాహుతి యత్నం (Self immolation attempt) చేశాడు. ఆ ప్రాంతంలోనే విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది సకాలంలో గుర్తించి మంటలు ఆర్పివేసి హుటాహుటిన అతని ఆసుపత్రికి తరలించారు. ఆత్మాహుతికి యత్నించిన వ్యక్తిని తండుల్వాడి గ్రామానికి చెందిన సుభాష్ భానుదాస్ దేశ్‌ముఖ్‌గా గుర్తించామని, తన సోదరుడితో తగాదా పడి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలుస్తోందని పోలీసులు చెప్పారు.


భానుదాస్ దేశ్‌ముఖ్ రైతు కాదని, ఈ ఘటన వెనుక ఇతమిత్థమైన కారణాలను తెలుసుకున్న తర్వాతే తగు చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. 20 నుంచి 30 శాతం కాలిన గాయాల బారిన పడిన యువకుడిని జీటీ ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. ప్రస్తుతం అతను స్పృహలోనే ఉన్నాడని, మెరైన్ డ్రైవ్ పోలీసులు తదుపరి దర్యాప్తు సాగిస్తున్నారని చెప్పారు.

Updated Date - 2022-08-23T23:08:41+05:30 IST