అధికారులపై మండిపడిన ఓఎస్డీ
ABN , First Publish Date - 2022-08-11T04:37:13+05:30 IST
ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని ఓఎస్డీ అనిల్ కుమార్రెడ్డి అధికారులపై మండిపడ్డారు.
చక్రాయపేట, ఆగస్టు 10: ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని ఓఎస్డీ అనిల్ కుమార్రెడ్డి అధికారులపై మండిపడ్డారు. ఎంపీడీఓ కార్యాలయంలో అన్ని శా ఖల అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలో మంజూ రైన ఇళ్లు, పూర్తయిన, నిర్మాణం, పునాదుల స్థాయిపై ఆరా తీశారు. సర్పంచు లు, ఎంపీటీసీలు కలిసి ఇళ్ల నిర్మాణానికి కృషిచేయాలన్నారు. ఇసుక ఇప్పిస్తే అంతా కట్టుకుంటారని జడ్పీటీసీ శివారెడ్డి అడిగారు. స్పందించిన ఆయన ఇసుకకు పర్మిషన్ ఇప్పిస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శివారెడ్డి, జడ్పీటీసీ శివారెడ్డి, తహసీల్దార్ రాజసింహనరేంద్ర తదితరులు పాల్గొన్నారు.