రాజ్యాంగ పీఠికను చదవాలి: భాగవత్‌

ABN , First Publish Date - 2021-01-27T06:48:27+05:30 IST

గణతంత్ర దినోత్సవం రోజు పౌరులు రాజ్యాంగ పీఠికను చదవాలని ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ అన్నారు. మంగళవారం 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలకు ఆయన

రాజ్యాంగ పీఠికను చదవాలి: భాగవత్‌

అహ్మదాబాద్‌, జనవరి 26: గణతంత్ర దినోత్సవం రోజు పౌరులు రాజ్యాంగ పీఠికను చదవాలని ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ అన్నారు. మంగళవారం 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అహ్మదాబాద్‌లో మూడు రోజుల  పర్యటనలో ఉన్న ఆయన.. ఆరెస్సెస్‌ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసి మాట్లాడారు. జనగణమన పాడుతుంటే పంజాబ్‌, సింధ్‌, గుజరాత్‌, మరాఠా ప్రాంతాలతో పాటు దేశ సరిహద్దులు, పర్వతాలు, నదులు మన కళ్ల ముందు ప్రత్యక్షమైనట్లు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2021-01-27T06:48:27+05:30 IST