అనాథలైన నిరుపేద పిల్లలు
ABN , First Publish Date - 2020-12-03T05:32:25+05:30 IST
అనాథలైన నిరుపేద పిల్లలు
- గతంలోనే తండ్రి, ఇప్పుడు తల్లి మృత్యువాత
కందుకూరు: మండలంలోని బేగంపేట తండాకు చెందిన ఓ నిరుపేద కుటుంబంలో విషాదం నెలకొంది. కొర్ర మాన్సింగ్-చర్ల దంపతులది నిరుపేద కుటుంబం. కూలిపనులు చేసి కుటుంబాన్ని పోషించేవారు. వారికి ఇద్దరు అమ్మాయిలు, ఒక్క కూమారుడు. కాగా 2017లో మాన్సింగ్ మృతిచెందాడు. అప్పటి నుంచి పిల్లలను పోషించడానికి అతడి భార్య చర్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. ఇటీవల ఆమెకు రెండు కిడ్నీలు చెడిపోయి. అనారోగ్యంతో బుధవారం మృతిచెందింది. దీంతో వారి సంతానం రోడ్డునపడింది. ఆమె కుమారుడు కొర్ర శివ తుక్కుగూడలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. పెద్దకుమార్తె స్ఫూర్తి మహేశ్వరంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో 8వ తరగతి, చిన్న కూతురు అక్షయ స్థానిక పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నారు. విద్యాభ్యాసం తో చురుకుగా ముందుకు సాగుతున్న వారి జీవితం తల్లి మరణంతో అగమ్య గోచరంగా మారింది. దాతలు సహాయం అందిస్తే తప్ప వారి మనుగడ కష్టంగా ఉందని తండా వాసులు పేర్కొంటున్నారు.