కొండపల్లి మైనింగ్‌పై విచారణకు ఆదేశం..

ABN , First Publish Date - 2021-09-01T17:45:42+05:30 IST

అమరావతి: కొండపల్లి మైనింగ్‌పై టీడీపీ నేత వర్ల రామయ్య రాసిన లేఖపై.. ఎన్​హెచ్​ఆర్సీ (జాతీయ మానవహక్కుల కమిషన్) స్పందించింది. కృష్ణా జిల్లా కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో అక్రమ మైనింగ్‌పై వర్ల రాసిన లేఖపై విచారణకు

కొండపల్లి మైనింగ్‌పై విచారణకు ఆదేశం..

అమరావతి:  కొండపల్లి అక్రమ మైనింగ్‌పై టీడీపీ నేత వర్ల రామయ్య రాసిన లేఖపై.. ఎన్​హెచ్​ఆర్సీ (జాతీయ మానవహక్కుల కమిషన్) స్పందించింది. కృష్ణా జిల్లా కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో అక్రమ మైనింగ్‌పై వర్ల రాసిన లేఖపై విచారణకు ఆదేశించింది. చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారికి.. ఎన్​హెచ్​ఆర్సీ స్పష్టం చేసింది. అలాగే తీసుకున్న చర్యలపై 8వారాల్లోగా ఫిర్యాదుదారుకు వివరణ ఇవ్వాలని లా రిజిస్ట్రార్​కు సూచించింది. కృష్ణా జిల్లా కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో అక్రమంగా మైనింగ్ నిర్వహిస్తున్నారని, చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు పోరాటం చేస్తున్న విషయం విదితమే.

Updated Date - 2021-09-01T17:45:42+05:30 IST