పరిహారంపై ప్రభుత్వాన్ని ఆదేశించండి: సాకే
ABN , First Publish Date - 2021-05-14T08:51:27+05:30 IST
ఆసుపత్రులలో ఆక్సిజన్ సరఫరాలో నిర్లక్ష్యం కారణంగా మృతి చెందుతున్న కొవిడ్ బాధిత కుటుంబా
అమరావతి, మే 13(అమరావతి): ఆసుపత్రులలో ఆక్సిజన్ సరఫరాలో నిర్లక్ష్యం కారణంగా మృతి చెందుతున్న కొవిడ్ బాధిత కుటుంబాలకు రూ.25 లక్షలు, కొవిడ్తో చనిపోయినవారి కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున ప్రభుత్వం చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని మానవ హక్కుల సంఘం, గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్కు కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ వినతి పత్రాలను పంపారు.