విశ్రాంత తహసీల్దార్పై చర్యలకు ఆదేశం
ABN , First Publish Date - 2021-02-26T04:54:59+05:30 IST
విశ్రాంత తహసీల్దార్పై చర్యలకు ఆదేశం
యాదమరి, ఫిబ్రవరి 25: విశ్రాంత తహసీల్దార్ రమేష్బాబుపై చర్యలకు ప్రభుత్వం ఆదేశించింది. గతంలో యాదమరి తహసీల్దార్గా పనిచేసిన సమయంలో ఆయన నిబంధనలకు విరుద్ధంగా అనర్హులకు సన్న, చిన్నకారు రైతు సర్టిఫికెట్లు మంజూరు చేశారని, వాటి ద్వారా సదరు రైతులు ఉపాధి పథకం కింద మామిడి మొక్కలు నాటుకున్నట్లు డ్వామా అధికారులు గుర్తించి ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. విచారణ జరిపిన అధికారులు తన అభ్యంతరాలు తెలియజేయాలని రమేష్బాబును కోరినా స్పందిచకపోవడంతో ఆయనపై చర్యలకు ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉషారాణి గురువారం ఆదేశాలు జారీ చేశారు.