కొవ్వూరు మున్సిపల్ ఆఫీస్ వద్ద Opposition parties ఆందోళన
ABN , First Publish Date - 2022-06-03T17:01:06+05:30 IST
కొవ్వూరు మున్సిపల్ ఆఫీస్ ఎదుట టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నేతలు నిరసనకు దిగారు.
తూర్పు గోదావరి: కొవ్వూరు మున్సిపల్ ఆఫీస్ ఎదుట టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నేతలు నిరసనకు దిగారు. మున్సిపల్ హైస్కూల్ను విద్యా శాఖలో విలీనం చేయడానికి వీలు లేదని డిమాండ్ చేశారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరుగుతుండగా విపక్షాలు ఆందోళన చేపట్టారు. కౌన్సిల్ సమావేశంలోనూ ఇదే అంశంపై ప్రతిపక్ష పార్టీల నిరసనకు దిగారు. దీంతో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రెండుసార్లు వాయిదా పడింది. విపక్షాల నిరసనతో కొవ్వూరు మున్సిపల్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.