ప్రతిపక్ష నేతలను పద్ధతి లేకుండా అడ్డుకుంటున్నారు: బోండా ఉమ

ABN , First Publish Date - 2021-07-30T22:40:20+05:30 IST

ప్రతిపక్ష నేతలను పద్ధతి లేకుండా అడ్డుకుంటున్నారు: బోండా ఉమ

ప్రతిపక్ష నేతలను పద్ధతి లేకుండా అడ్డుకుంటున్నారు: బోండా ఉమ

అమరావతి: ఏపీ ప్రభుత్వంపై టీడీపీ నేత బోండా ఉమ విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష నేతలను పద్ధతి లేకుండా అడ్డుకుంటున్నారని ఏబీఎన్‌తో టీడీపీ నేత బోండా ఉమ అన్నారు. లక్షల టన్నుల ఇసుక పక్క రాష్ట్రాలకు తరలిపోతోందని, మైనింగ్‌ను ప్రభుత్వం ఇష్టారీతిన దోచుకుంటోందని బోండా ఉమ ఆరోపించారు. అక్రమ మైనింగ్‌పై టీడీపీ పోరాటం కొనసాగిస్తూనే ఉందని, ప్రశ్నించిన దేవినేనిపై అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేశారని బోండా ఉమ విమర్శించారు. వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకే టీడీపీ నిజనిర్ధారణ కమిటీ ఉందని, అక్రమ అరెస్టులకు టీడీపీ భయపడదని టీడీపీ నేత బోండా ఉమ స్పష్టం చేశారు. పోలీసులు విధులను మర్చిపోయి వైసీపీకి ఊడిగం చేస్తున్నారని బోండా ఉమ మండిపడ్డారు.

Updated Date - 2021-07-30T22:40:20+05:30 IST