గవర్నర్ ప్రసంగం లేకపోవడంతో ప్రతిపక్షాల గొంతు నొక్కడమే: భట్టి
ABN , First Publish Date - 2022-03-06T18:13:13+05:30 IST
ప్రభుత్వం తూ తూ మంత్రంగా బడ్జెట్ సమావేశాలు జరపాలని చూస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తప్పుబట్టారు.
హైదరాబాద్: ప్రభుత్వం తూ తూ మంత్రంగా బడ్జెట్ సమావేశాలు జరపాలని చూస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తప్పుబట్టారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకపోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. సభ పొరోగ్ జరగలేదని చెప్పడం.. సాంప్రదాయానికి పూర్తి విరుద్ధమన్నారు. ఇన్ని రోజులు పొరోగ్ చేయలేదంటేనే రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనని భట్టి పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగం లేకపోవడంతో ప్రతిపక్షాల గొంతు నొక్కడమేనని విమర్శించారు. గవర్నర్కు ధన్యవాదాలు చెప్పే సందర్భంగా .. ప్రభుత్వ విధానాలను ఎండగట్టే అవకాశం కోల్పోయామని భట్టి విక్రమార్క తెలిపారు.