Chandragiriలో విపక్షాల ఆందోళన
ABN , First Publish Date - 2022-06-15T19:47:40+05:30 IST
నగరంలోని చంద్రగిరిలో విపక్షాలు బుధవారం ఆందోళనకు దిగాయి.
తిరుపతి: నగరంలోని చంద్రగిరిలో విపక్షాలు బుధవారం ఆందోళనకు దిగాయి. గతంలో పోలీసుశాఖకు కేటాయించిన స్థలాన్ని వైసీపీ ఆఫీస్ ఏర్పాటుకు ఇవ్వడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన జీవో ప్రకారం జిల్లా కేంద్రంలోనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. తక్షణం జీవోను రద్దు చేయకపోతే ఆమరణ దీక్ష చేస్తామని విపక్షాలు హెచ్చరించారు. వైసీపీ పాలనలో పోలీస్శాఖకు కేటాయించిన స్థలానికే రక్షణ లేదన్నారు. వైసీపీ ప్రభుత్వ తీరుపై టీడీపీ, వామపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.