జీపీఎస్‌ను వ్యతిరేకిస్తున్నాం: ఎస్టీయూ

ABN , First Publish Date - 2022-05-26T06:44:09+05:30 IST

రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన జీపీఎస్‌ను వ్యతిరేకిస్తున్నట్లు ఎస్టీయూ నా యకులు పేర్కొన్నారు. బుధవారం ఎమ్మార్సీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో డిమాండ్‌ చేశారు

జీపీఎస్‌ను వ్యతిరేకిస్తున్నాం: ఎస్టీయూ
ప్రసంగిస్తున్న ఎస్టీయూ నాయకులు

పుంగనూరు రూరల్‌, మే 25: రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన జీపీఎస్‌ను  వ్యతిరేకిస్తున్నట్లు ఎస్టీయూ నా యకులు పేర్కొన్నారు. బుధవారం ఎమ్మార్సీ కార్యాలయంలో జరిగిన  సమావేశంలో పుంగనూరు డివిజన్‌ కన్వీనర్‌ శంకర్‌ మాట్లాడుతూ... ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆమోదయోగ్యమైన పాత పింఛన్‌ విధాన్ని అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న పీఆర్సీని వెంటనే విడుదల చేయాలని, జడ్పీ పీఎఫ్‌, ఏిపీజీఎల్‌ఐ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రామసముద్రం ఎస్టీయూ అధ్యక్షుడు అయూబ్‌ఖాన్‌ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు  చేస్తున్న నూతన విద్యావిధానంపై పునః సమీక్షించి అభిప్రాయాలకు అనుగుణంగా అమలు చేయాలని, డీఎస్సీని ప్రకటించి ఏకోపాధ్యాయ పాఠశాలలకు ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. అలాగే ఈ నెల 27న తిరుపతిలో జరిగే జిల్లా కౌన్సిల్‌ సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.  

Updated Date - 2022-05-26T06:44:09+05:30 IST