అక్టోబరు 31 వరకు బీపీఎస్కు అవకాశం
ABN , First Publish Date - 2020-08-04T11:04:54+05:30 IST
నెల్లూరు నగరంలో అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ పథకాన్ని (బీపీఎస్) అక్టోబరు 31వ తేదీ వరకు కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ..
నెల్లూరు (సిటీ), ఆగస్టు 3 : నెల్లూరు నగరంలో అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ పథకాన్ని (బీపీఎస్) అక్టోబరు 31వ తేదీ వరకు కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జే శ్యామలరావు సోమవారం ఉత్తర్వులిచ్చారు. ఈ మేరకు జీవో 339 విడుదల చేశారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను గడువులోపు పూర్తి చేయాలని నగర పాలక సంస్థ అధికారులకు సూచించారు. దీంతో అభ్యంతరం లేని అక్రమ నిర్మాణాలన్నింటినీ క్రమబద్ధీకరించుకునేందుకు మరోమారు అవకాశం లభించింది. దీని ద్వారా కార్పొరేషన్కు భారీగా ఆదాయం సమకూరనున్నది.